JANGITISRINIVASMUDIRAJ96

Dec 01 2023, 19:38

పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ ప్రణత్యాగమే నేటి ఆకుపచ్చ తెలంగాణ! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ ప్రణత్యాగమే నేటి ఆకుపచ్చ తెలంగాణ!

తేది: 01-12-2023 శుక్రవారం

చిన్నకోడూర్ న్యూస్

స్వరాష్ట్రం ఏర్పడి ఆకుపచ్చ పసిడి తెలంగాణగా దూసుకు పోతుందంటే అది పోలీస్ కిష్టన్న ప్రాణ త్యాగ ఫలితమే నని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు అన్నారు.

పోలీస్ కిష్టన్న14వ వర్దంతి సందర్భంగా చిన్నకోడూర్ ముదిరాజ్ ఫంక్షన్ హాల్లో మండల అధ్యక్షుడు మేడికాయల వెంకటేశం ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ముదిరాజ్ సభ్యులు కిష్టన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఈ సందర్భంగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ సమాఖ్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల నీడన తెలంగాణ నెర్రెలు వారి తలపున గోదావరి గలగలా పారిన తాగడానికి గుక్కెడు నీళ్ళు దొరుకని సమయాన స్వరాష్ట్రం కోరుతు మాలి దశ ఉద్యమం చేస్తున్నపుడు రాష్ట్రం సిద్దించేవరకు పోరాటం అగకూడాని నినదిస్తూ తన సర్వీస్ రివల్ వార్ తో కాల్చుకొని ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు పోలీస్ కిష్టన్న ముదిరాజ్ అయన ప్రాణత్యాగంతో ఉద్యమాన్ని సకలజనుల సమ్మేగా మారిందని అసమ్మే ద్వార కేంద్ర ప్రభుత్వాన్ని ఊపిరాడకుండా చేసిందని తట్టుకోలేక కేంద్రం తెలంగాణ ప్రకటించిందని అన్నారు.

తెచ్చుకున్న తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకో తాగు సాగు నీరు తెచ్చుకున్నామని ప్రాజెక్టుల ద్వార నెర్రెలు వారిని బీడు భూములు నేడు సశ్యశమలమై పచ్చని పసిడి తెలంగాణగా మారిందని దీనికి కారణం మీ ప్రణత్యాగమని కిష్టన్న మిమ్ములను జాతి మరువదని అన్నారు.

ఈ కార్యక్రమంలో కోరబోయిన సుధాకర్, కొత్త బాల్ రాజు, ఇట్టబోయిన బాలపోషయ్య, బోయిని ఆనందం, పసుపుల సాయిలు, ముత్తయ్య, బుచ్చెలిరమేష్, దుర్గం ఎల్లం, ఉప్పరమేన శంకర్, రామంచ రాములు, ఇట్టబోయిన లక్ష్మణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

JANGITISRINIVASMUDIRAJ96

Nov 08 2023, 06:09

తెలంగాణ తొలి ఉద్యమకారుడు నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు

తెలంగాణ తొలి ఉద్యమకారుడు నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు

తేది: 07-11-2023 మంగళవారం

రంగదాంపల్లి సిద్దిపేట న్యూస్

హైదరాబాద్ మాజీ మేయర్ మహారాజ్ గంజి మాజీ శాసనసభ్యులు నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ గారి జయంతి పురస్కరించుకొని పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మిద్దె రవి ముదిరాజ్ గారి అధ్యక్షతన లక్ష్మీనారాయణ ముదిరాజ్ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, సిద్దిపేట నియోజకవర్గ జేఏసీ చైర్మన్ పడిగే ప్రశాంత్ ముదిరాజ్, సోషల్ మీడియా జిల్లా చేర్మెన్ సుతారి రాజు ముదిరాజ్ లు మాట్లాడుతూ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా, హైదరాబాద్ నగర మేయర్ ఉన్న నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ గారు 1969లో తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన తొలి ఉద్యమంలోనే ఆయన కీలక భూమిక పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేశాడని అప్పటికే హైదరాబాద్ మేయర్ గా ఆయన ఉన్నాడని పదవి సైతం పక్కనపెట్టి తెలంగాణ కోసం పోరాటము చేసిన గొప్ప ఉద్యమకారుడు అని వారు అన్నారు.

 అదేవిధంగా ఆయన మహారాజ్ గంజి శాసన సభ్యునిగా ఓ పర్యాయము కూడా ఉన్నాడని ఆ సమయంలోనే ముదిరాజుల హక్కుల కోసం పోరాటం చేస్తూ ముదిరాజులకు రిజర్వేషన్ కల్పించాలని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మత్స్య శాఖలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అప్పటి ప్రభుత్వం పైన పోరాటం చేసిన మహానియుడని అన్నారు.

తెలంగాణ కోసం పోరాటం చేసిన ముదిరాజ్ బిడ్డల విగ్రహాలను ట్యంక్ బండ్ పైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పైస రామకృష్ణ, చెంది శ్రీనివాస్, పుల్లూరి సుధాకర్, తోడేంగల నవీన్, యాట రాజేష్, కొంతం శ్రావణ్, ఈర్ల సత్యం ముదిరాజ్, గాడిచర్ల యాదగిరి, జీకురి శ్రీనివాస్, వెంకటస్వామి ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

JANGITISRINIVASMUDIRAJ96

Oct 31 2023, 17:21

భారత దేశానికి ఆదర్శమూర్తి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ నేషనల్ కాంగ్రేస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు

భారత దేశానికి ఆదర్శమూర్తి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

నేషనల్ కాంగ్రేస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు

తేది: 31-10-2023 మంగళవారం

చిన్నకోడూర్ న్యూస్

మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ బడుగు బలహీన ప్రజల ఆత్మగౌరవం అన్నదాత అని నేషనల్ కాంగ్రేస్ వర్కర్స్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు కొనియాడారు.

ఇందిరాగాంధీ వర్దంతి సందర్భంగా మంగళవారం రోజు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఇందిరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ దేశంలో పేదరిక నిర్ములన కోసం ఆమె కృషి ఎంతో ఆమోగమని గరీబీ హఠావో అనే నినాదంతో పేదలకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడాని బట్టలు అందించిన గొప్ప నాయకురాలు ఇందిరా అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఐ.ఎన్.టి.యు.సి జిల్లా అధ్యక్షుడు సుంచు రమేష్, మండల కాంగ్రేస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తుమ్మల శ్రీనివాస్, ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు బంక చిరంజీవి యాదవ్ అజ్జు యాదవ్, మ్యాకల ఎల్లం, పోషమల్లు, రాకేష్, నముండ్ల వినోద్, గొళ్లపల్లి రాకేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

JANGITISRINIVASMUDIRAJ96

Oct 29 2023, 18:36

కాంగ్రేస్ పార్టీని విమర్శించే స్ధాయి నీకు లేదు కేటీఆర్! కడెం ప్రాజెక్ట్ గేట్లఫై నుండి నిమిషానికి ఆరు లక్ష క్యూసెక్కుల నీరు ప్రవహించిన ఏమికాలే

కాంగ్రేస్ పార్టీని విమర్శించే స్ధాయి నీకు లేదు కేటీఆర్!

కడెం ప్రాజెక్ట్ గేట్లఫై నుండి నిమిషానికి ఆరు లక్ష క్యూసెక్కుల నీరు ప్రవహించిన చెక్కు చెదరలేదు!

ఓటమి భయంతో మేకపోతు గంభీర్యాని ప్రదర్శిస్తున్న డ్రామా రావు!

మండిపడ్డ

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 29-10-2023 ఆదివారం

చిన్నకోడూర్ న్యూస్

బి.ఆర్.ఎస్ పార్టీ ఒడిపోతుందనే భయంతో కేటీఆర్ పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని నేషనల్ కాంగ్రేస్ వర్కర్స్ రాష్ట్ర కార్యానిర్వహన అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

ఆదివారం రోజు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జంగిడి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ 70 సంవత్సరాల క్రితం నిర్మించిన కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ లో గేట్ల పై నుండి నిమిషానికి ఆరు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించిన చెక్కుచెదరలేదని మీరు నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ ఐదు సంవత్సరాలకి కుప్పకూలుతుంది కనపడతలేదని కాంగ్రెస్ కట్టడాలకు మీ కట్టడాలకు ఎంత తేడా ఉందో తన్ను కనపడతలేవా అని మండిపడ్డారు.

దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అవకాశం ఇస్తే భారతదేశాన్ని అభివృద్ధిలో నిలపడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు వ్యవసాయ భూమిని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా గరీబ్ హటావో అని నినాదంతో కూడు గూడు గుడ్డ కాంగ్రెస్ పార్టీ కాదా రైతులకు సబ్సిడీ కింద విత్తనాలు పనిముట్లు ఎరువులు అందించింది కాంగ్రెస్ పార్టీ కాదా పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా పేద ప్రజలకు ఆరోగ్యశ్రీనిచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా 108 అంబులెన్స్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు ఇస్తూ ఉపాధి కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా ఏక కలంలో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేదా చివరికి కెసిఆర్ కు ముఖ్యమంత్రి పదవి వచ్చిందంటే అందుకు కారణం కాంగ్రెస్ కాదా అమెరికాలో బతకనికి పోయిన నువ్వు నీ చెల్లె రాష్ట్రాన్ని ఏలుతున్నారంటే అది కాంగ్రెస్ బిక్ష కాదా పది సంవత్సరాలు కెసిఆర్ ను నమ్మి ఓట్లు వేస్తే ఒక్క ఉద్యోగం ఇవ్వక పోతిరి అది కాకుండా వీఆర్వో వీఆర్ఏ తీసేతిరి హౌసింగ్ కార్పొరేషన్ తీసేస్తేరి నిరుద్యోగ భృతి ఈయకనే పోతిరి మాయల ఫకీర్ వలె మాటలు మారుస్తూ మల్ల గద్దెనెక్కలని అనుకుంటున్నారమో కేటీఆర్ ఇగ మీ పప్పులు ఉడకవు రాబోయేది కాంగ్రేస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ప్రజలకు అందించేది కాంగ్రేస్ ప్రభుత్వం గుర్తు పెట్టుకో రైతుల రెండు లక్షల రుణమాఫీ చేస్తూ ఎకరానికి పదిహేను వేల రైతు భందు ఇచ్చేది కాంగ్రేస్ ప్రభుత్వం మీ అవినీతిని బైటకు తీసి మిమ్ములను జైల్లో పెట్టేది కాంగ్రేస్ ప్రభుత్వం అందుకే మీ ఎన్నులో వణుకు పుట్టి నువ్వు నీ నాయిన మతిభ్రమించ్చిన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లం, బి.సి సెల్ మండల అధ్యక్షుడు బంక చిరంజీవి యాదవ్, యూత్ కాంగ్రేస్ షోషల్ మీడియా కోర్డినేటర్ సామల సంతోష్, ఏర్వా సత్యం, గొడుగు దిలీప్ తదితరులు ఉన్నారు.

JANGITISRINIVASMUDIRAJ96

Aug 22 2023, 17:29

ముదిరాజులంట్టే కేసీఆర్ కు మొదటినుండి చిన్నచూపే! పది సంవత్సరాల కాలంలో ముదిరాజులకు కేసీఆర్ చేసింది ఏమిలేదు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజులంట్టే కేసీఆర్ కు మొదటినుండి చిన్నచూపే!

పది సంవత్సరాల కాలంలో ముదిరాజులకు కేసీఆర్ చేసింది ఏమిలేదు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 22-08-23 మంగళవారం

చిన్నకోడూర్ న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో ముదిరాజులను ఏనాడు పట్టించుకోలేదు ఐన బానిస ముదిరాజులు దొర కాల్లకాడనే ఉంటున్నారని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మండిపడ్డారు

సంఘ సభ్యులతో కలసి మంగళవారం చిన్నకోడూరులో మాట్లాడుతూ కేసీఆర్ మాయమతలకు మోసపోతున్న ముదిరాజులు కేసీఆర్ ను నమ్మి ఉధ్యమ కాలం నుండి ఎన్నో పోరాటాలు చేసి 60 మంది ముదిరాజ్ ల ప్రాణాలను బలిపెట్టి తెచ్చుకున్న తెలంగాణలో ముదిరాజులకు వచ్చింది ఏమి లేదని అన్నారు

కేసీఆర్ గద్దెనెక్కెవరకు ముదిరాజులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఒకేఒక్కడైన ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారికి యం.ఎల్.ఏ మంత్రి పదవులు ఇచ్చి తన కుటుంబం మరియు తన సామాజిక వర్గంను ఆర్థికంగా రాజకీయంగా బలపర్చుకో అన్ని రకాలుగా బలపడ్డంక్క ఈటెలను టీఆరెస్ నుండి బైటకు పంపిన కపటుడు కేసీఆర్ అని మండిపడ్డారు

న్యాయంగా ముదిరాజులకు దామాషా ప్రకారం 12 సీట్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్కటి కూడ ఇవ్వకపోవం ఎంతవరకు సమంజసమని అన్నారు

పటన్ చెరు నీలం మధు ముదిరాజ్ లాంటి బలమైన నాయకులు బి.ఆర్.ఎస్ పార్టీలో ఎంతో మంది ఉన్నారని అలంటి నాయకులను పక్కన పెట్టి ఉన్నత వర్గాలకు పెద్దపీట వేశాడని ముదిరాజులు ఇకనైనా మేల్కొని బి.ఆర్.ఎస్ నుండి బైటకు రావాలని అన్యాయం జరిగిన బిసి కులాల మద్దతుతోని బి.ఆర్.ఎస్ కు బుద్ది చెప్పి ముదిరాజులంటే ఏంటో చూపిద్దామని జంగిటి అన్నారు.

ఈ కార్యక్రమంలో దొంతురబోయిన శ్రీనివాస్, గుడిపల్లి వికాస్, రాగిరి యాదగిరి, కోరబోయిన భారత్, శివ, చందు, సుధాకర్ తదితరులు ఉన్నారు.

JANGITISRINIVASMUDIRAJ96

Aug 21 2023, 13:59

నిప్పుకు చెదలు పట్టదు జగ్గన్న కాంగ్రేస్ ను వదిలిపెట్టడు! అసత్యప్రచారాలతో జగ్గన్న ప్రతిష్టను తాకలేరు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

నిప్పుకు చెదలు పట్టదు జగ్గన్న కాంగ్రేస్ ను వదిలిపెట్టడు!

అసత్యప్రచారాలతో జగ్గన్న ప్రతిష్టను తాకలేరు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 21-08-23 సోమవారం

చిన్నకోడూర్ న్యూస్

సంగారెడ్డి యం.ఎల్.ఏ జగ్గారెడ్డి గారిని నేరుగా ఎదురుకోలేకనే చాటు మాటలతో జగ్గన్న ప్రతిష్టను దెబ్బతియ్యలని బి.ఆర్.ఎస్ మరియు ఇతరులు చూస్తున్నారని మత్య్సకారుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మండిపడ్డారు

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మచ్చ లేని జగన్న మీద తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో అలజడి సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని అది వారు ఆకాశం పైన ఉమ్మినట్లేనని అన్నారు

సంపాదన పైన ఆశ ఉన్నోడు మాటిమాటికి పార్టీలు మారుతారని జగన్నకు అలంటి అవసరం ఏమి లేదని ఆయనకు సంపాదనమీద ధ్యాస ఉంటె ఎప్పుడో ఆ పని చేసేవడాని అనేక ఫేమౌజులు కట్టుకునేవాడని సీజ్ బ్యాంకు లో పెట్టుకునేంత డబ్బు సంపాదించే వాడని జంగిటి అన్నారు

అయన తపనంత ప్రజల కోసమేనని ఎప్పుడు ప్రజా శ్రేయష్యే కోరుకుంటాడాని అందుకే సంగారెడ్డి ప్రజలు జగన్నను గెలిపిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో బారి మెజార్టీతో గెలుస్తాడాని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మరోసారి ఇలాంటి దిగజారుడు ఎవరు మాట్లాడిన తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుందని హెచ్చరించారు.

JANGITISRINIVASMUDIRAJ96

Jun 02 2023, 13:11

తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మాలని చూస్తున్న కేసీఆర్! ప్రజా పాలన గాలికొదిలి ప్రభుత్వ భూములు అమ్ముకు తింటున్న కేసీఆర్! సోనియా గాంధీకి పాలాభిషేకం

తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మాలని చూస్తున్న కేసీఆర్!

ప్రజా పాలన గాలికొదిలి ప్రభుత్వ భూములు అమ్ముకు తింటున్న కేసీఆర్!

సోనియా గాంధీకి పాలాభిషేకం చేసిన కాంగ్రేస్!

తేది: 02-06-2023 శుక్రవారం

చిన్నకోడూర్ న్యూస్

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి మండల కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భాగా పిసిసి భూ కమిటీ మాజీ సభ్యులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు మిట్టపల్లి గణేష్, ఐ.ఎన్.టి.యు.సి జిల్లా అధ్యక్షులు సుంచు రమేష్ లు మాట్లాడుతూ తెలంగాణ తెచ్చుకున్నది జల్ జంగల్ జమీన్ అన్నట్లు నిధులు నియామకాలు నీరు ఆంధ్ర పాలకుల చేతుల్లో అన్యాక్రాంతం ఐతున్నయని సీమాంధ్రులతో కలిసి ఉంట్టే తెలంగాణ ప్రజలకు మనుగడ ఉండదని కౌలుకళాకారులు విద్యావంతులు విద్యార్థులు ప్రాణాలు వదులుతూ పోరాటం చేస్తుంటే చలించ్చిపోయిన సోనియమ్మ తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు సీమాంధ్ర ఎంపీలు ప్రాణాంతకమైన పెప్పెర స్ప్రేలు కండ్లలో నోటిలో కొట్టి ఊపిరి ఆడకుండా చేసినప్పుడు ఈ కేసీఆర్ ఎక్కడున్నాడని అన్నారు.

ఆంధ్రవాళ్ళు దాడులు చేస్తారని తెలిసే ఆనాడు కేసీఆర్ పార్లమెంటుకు పోలేదని ఆనాడు తెలంగాణ ఎంపీలు పొన్నం ప్రభాకర్ గారికి ఉపిరి ఆడకుండా చేసిన ప్రాణాలను పణంగా పెట్టి అటు సోనియమ్మ తో పాటుగా బిజెపి ఎంపీ షుష్మాస్వరాజ్ గారిని మద్దతు ఇవ్వమని అడిగి ఒప్పించి తెలంగాణ బిల్లు ఆమోదింప చేస్తే తెలంగాణ ఏర్పడిందని మోసపురితంగా తెలంగాణ ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన కెసిఆర్ ఉద్యోగాలు సప్సిడి తొలగించి ఉన్న శాఖలకు నియామకాలు చేయకుండా ప్రజా ధనాన్ని కొల్లగొడుతూ కేసీఆర్ మరియు తన సామాజిక వర్గాన్ని అక్రమ సంపాదనతో ఆకాశానికి లేపుతున్నాడని అన్నారు.

రాబోయే రోజులు కాంగ్రేస్ వే నని కేసీఆర్ ను తుంగలో తొక్కడం ఖాయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో గుడుమల్ల మల్లేశం, డి. శ్రీనివాస్, బాల్ రాజ్, చంద్రం, రమేష్, ఉన్నారు.

JANGITISRINIVASMUDIRAJ96

Apr 11 2023, 10:46

నవ సమాజ నిర్మాత మహాత్మ జ్యోతిరావు పూలే! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆర్.టీ.ఐ పి.సి జాతీయ అధ్యక్షులు

నవ సమాజ నిర్మాత మహాత్మ జ్యోతిరావు పూలే!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ఆర్.టీ.ఐ పి.సి జాతీయ అధ్యక్షులు

తేది: 11-04-2023 మంగళవారం

చిన్నకోడూర్ న్యూస్

మహాత్మ జ్యోతిరావు పూలే అంటరానితనం కులవ్యవస్థ నిర్ములనతో పాటుగా మహిళోద్దరణకు ఎనలేని పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి పూలే అని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని చిన్నకోడూర్ మండల కేంద్రంలో ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ నవసమాజ నిర్మాత మహాత్మ జ్యోతిరావు పూలే అని పెతందారి వ్యవస్థలో బానిస సంఖ్యలను తెంపుతు అంటరానితనాన్ని కులవ్యవస్థ నిర్ములన కోసం పోరాటం చేస్తూ మరోపక్క పేదల కోసం స్కూళ్లు స్థాపించి విద్య నేర్పిన మహోన్నతుడు పూలే అని అన్నారు.

అదే విదంగా మహిళల కోసం తన సహా ధర్మాచరిని సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పి ఆమె ద్వార మహిళలకు విద్యను అందించిన మహాను బావుండు పూలే అని అన్నారు.

బడుగు బలహీన వర్గాలుబుఅయన అడుగు జాడలో నడిచి ముందు తరాలకు మార్గదర్శులు కావాలని జంగిటి అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్, ఐ.ఎన్.టి.యు.సి జిల్లా అధ్యక్షుడు సుంచు రమేష్, ఆర్.టీ.ఐ పి.సి రాష్ట్ర కార్యదర్శి నాగేంద్రం, ఎస్.సి సెల్ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి కనకరాజు, లడ్డు శ్రీను, గుడుమల్ల చిన్న మల్లేశం, కస్తూరిపల్లి మహేందర్, కడారి శ్రీనివాస్, ఇస్తారి, మహేష్, సురేష్ తదితరులు ఉన్నారు.

JANGITISRINIVASMUDIRAJ96

Apr 08 2023, 14:19

విలేజ్ డెవలప్ మెంట్ కమిటీలపై చర్యతీసుకోండి కేసీఆర్ గారు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ మహాసభ మత్య్సకారుల రాష్ట్ర ఉపాధ్యక్షులు

విలేజ్ డెవలప్ మెంట్ కమిటీలపై చర్యతీసుకోండి కేసీఆర్ గారు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

ముదిరాజ్ మహాసభ మత్య్సకారుల రాష్ట్ర ఉపాధ్యక్షులు

తేది: 08-04-2023 శనివారం

చిన్నకోడూర్ న్యూస్

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విలేజ్ డెవలప్ మెంట్ కమిటీల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువై ముదిరాజ్ జాతిని టార్గెట్ చేసుకొని ముదిరాజులపైన కర్రతో రాళ్లతో దాడులు చేస్తూ గ్రామ బైస్కరణ చేస్తున్నారని దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించ్చి ముదిరాజ్ లకు న్యాయం చేయాలనీ ముదిరాజ్ మహాసభ మత్య్సకారుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు కోరారు.

ఈ రోజు చిన్నకోడూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కొక్కొండ మండలం రామన్న పేటలో పెద్దమ్మ దేవస్థానంకు సంబంధించిన భూమిని విలేజ్ డెవలప్ మెంట్ కమిటీకి ఇవ్వాలని ముదిరాజ్ సంఘానికి హుకుం జారీ చేశారని దేవాలయం భూమి ఇవ్వడం కుదరదని ముదిరాజులు చెప్పడంతో ఆగ్రహించిన వి.డి.సి కమిటీ సభ్యులు ముడిరాజులపై మూకుమ్మడిగా కర్రలతో రాళ్లతో దాడి చేసి గయా పర్చడమే కాకుండ గ్రామ బైస్కరణ చేశారని దాన్ని కండిస్తున్నామని జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు.

గత నెలరోజులుగా ముదిరాజులను ఎవరోతో మాట్లాడకుండా కట్టడి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈ సంఘటన పైన ప్రభుత్వం చర్యతీసుకోకుంటే రాష్ట్రంలో ఉన్న ముదిరాజులం కొక్కొండ గ్రామానికి వెళ్లి వి.డి.సి కి తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరిస్తున్నామని భరిస్తున్నారని దాడులు చేస్తే చూస్తూ ఉరుకోమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు కొత్త బాల్ రాజ్ ముదిరాజ్, ఇట్టబోయిన చంద్రం ముదిరాజ్. రాగిరి చందు ముదిరాజ్, రాగిరి నాగరాజు ముదిరాజ్, రాగిరి సాయి కుమార్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.

JANGITISRINIVASMUDIRAJ96

Mar 25 2023, 13:51

భారత దేశంలో నేడు చీకటి రోజు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ప్రజాస్వామ్యాన్నికి ,భావ ప్రకటన స్వేచ్ఛకు గోడ్డలిపేట్టు                                                                        ప్రజాస్వామ్య దేశంలో నేడు చీకటిరోజు                             

                                    మాజీ పిసిసి భూ కమిటీ మెంబర్ జంగింటి శ్రీనివాస్ ముదిరాజ్

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్వాన్ని కుట్రపూరితంగా రద్దు చేయడం అప్రజాస్వామికమని, దేశంలో నరేంద్ర మోడీ నియంతృత్వ విధానాన్ని అంతం చేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు చీకటి రోజుగా అభివర్ణస్తూ రాహుల్ గాంధీ గారి మీద తీసుకొన్న నిర్ణయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిట్టపల్లి గణేష్,మాజీ పిసిసి భూ కమిటి మెంబర్ జంగింటి శ్రీనివాస్ ముదిరాజ్* లు తీవ్రంగా ఖండించారు. 

మోడీ నిర్ణయాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో తేది: 25-03-2023 శనివారం రోజు మోడీ దిష్టి బొమ్మను కాంగ్రేస్ నాయకులు దగ్ధం చేశారు

ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు 1978లో శ్రీమతి ఇందిరా గాంధీ గారిని కూడా అప్పటి జనతాపార్టీ డిస్క్వాలిఫై చేస్తే ప్రజాధారణతో 1980 లో ప్రధానిగా పార్లమెంట్ లో అడుగుపెట్టిన విధానాన్ని గుర్తుచేసుకుంటూ..

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలిపెట్టులాంటిదని

దేశ ఐక్యత - ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టడం…

అదానీ- మోడీ చీకటి స్నేహం పై నిలదీయడం ,అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా పోరాటం చేయడం ప్రధాని మోడీకి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయని, నిన్న రాహుల్ గాంధీ మీద వచ్చిన తీర్పుపై హైకోర్ట్ లో అప్పీల్ చేసుకొనేందుకు నెలరోజులు గడువు ఇచ్చినా కూడా న్యాయవ్యవస్థ ఆదేశాలు గౌరవించకుండా నేడు చట్టవిరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బీజేపీ తీసుకొన్న నిర్ణయాన్ని తప్పుబట్టారు.

భవిష్యత్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేయకూడదనే దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ చేసిన కుట్ర ఈరోజు బహిర్గతమైనదని, దీనిని దేశ ప్రజలు గుర్తించాలని కోరారు. 

ప్రస్తుతం ఈదేశంలో ప్రధాని ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, నరేంద్ర మోడీ మరియు అమిత్ షా ఇద్దరు కలిసి అదానీ,అంబానీ లాంటి బడా వ్యాపారవేత్తలకు ఈ దేశాన్ని అమ్మేస్తున్నారని కేంద్రప్రభుత్వ నియంతృత్వ ధోరణిని, అప్రజాస్వామిక విధానాన్ని అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.

 లోక్ సభలో ఒక ఎంపీని అనర్హత వేటు వేయాలంటే, రాష్ట్రపతి మరియు ఎన్నికల కమిషనర్ తో సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది... కానీ ఈ బీజేపీ ప్రభుత్వం. స్వయం ప్రతిపత్తి గల సంస్థలను నిర్విరామం  చేసినది బిజెపి ప్రభుత్వం....

 ప్రజాస్వామ్యకు వాదులు మేధావులు, ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలలను ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు .... రాబోయే రోజులు బిజెపి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.